Saturday, 1 February 2014

Mangalagiri Temple Information

మంగళగిరి పానకాల నరసింహ స్వామి(క్షేత్ర మహత్యం) :
 
మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉన్నది. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉన్నది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు.
 

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం :

ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదం గా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు.

 

శ్రీమన్నారాయణుడు స్వయంభూగా అవతరించిన పుణ్యక్షేత్రాలు ఎనిమిది. శ్రీరంగం, శ్రీ ముష్ణం, నైమిశారణ్యం, పుష్కరం, సాలిగ్రామం, దోదాద్రి, భద్రికామ్రం, వెంకటాద్రి. ఇందులో దోదాద్రి ఎంతో పవిత్రమైన మంగళగిరి పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ స్వామి స్వయంభూవుగా అవతరించిన వైనం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కృతయుగం కాలంలో........ పరియత్రుడు అనే రాజుకు హ్రస్వశ్రుంగి అనే పుత్రుడు జింకరూపంతో ఉండేవాడు. తన జింకరూపం మారి మామూలు మనిషి రూపం దాల్చటానికి అతడు దోదాద్రిలో తపస్సు చేసాడు.

అతని తపస్సుకి సంతసించిన ఇంద్రుడు ప్రత్యక్షమై నీవు నారాయణుని ధ్యానించి కఠిన తపస్సు చెయ్యు.... నారాయణుడు నీవు కోరిన వరాన్ని ప్రసాదించగలడు. అని ఆశీర్వదించి అద్రుశ్యమయ్యినాడు.

దోదాద్రి పై తపస్సుచేస్తున్న పుత్రుడిని తీసుకెళ్ళి, సింహాసనముపై కూర్చుండబెట్టి, పట్టాభిషేకము చెయ్యాలని నిర్ణయించుకొన్న పరియత్రుడు అక్కడికి వెళ్ళాడు.

రాజ్యానికి తిరిగి వెళితే నారాయణుడు ఆశీర్వాదము తనకు లభించదు భయంతో హ్రాస్వశ్రుంగి ఏనుగు రూపం లో ఉన్న ఒక కొండగా మారాడు. ఎటువైపునుండి చూసినా నేటికీ ఆ కొండ ఏనుగు రూపంలో కనిపిస్తుంది.

ఇది ఇలా ఉండగా నముచి అనే అసురుడు బ్రహ్మదేవుని కోసం కఠిన తపస్సు చేసాడు. అతని తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. నముచి "తడిగా ఉన్న ఏ వస్తువుతో కానీ, ఎండిపోయి రాలిపోయిన ఏ వస్తువుతో కానీ, నాకు మృత్యువు వాటిల్లకూడదు" అని అడుగగా బ్రహ్మ తథాస్తు అని అన్నాడు.

మంగళగిరి శ్రీ లక్ష్మి నృసింహస్వామి వారికి తంజావూరు మహారాజు బహుకరించిన దక్షినావ్రుత శంఖు

నముచి తన వర ప్రభావంతో దేవతలని నానా బాధలు కలుగ జేశాడు. ఇంద్రుడు నారాయుని వద్దకు వెళ్ళి, నుముచి నుండి అన్యాయములను అంతమొందించమని వేడుకొన్నాడు. వెంటనే నారాయణుడు ఇంద్రునకు తన చక్రం ఇచ్చి నుముచి పై దండెత్తమని చెప్పాడు. ఇంద్రుడు తన సైన్యంతో నముచి యొక్క సైన్యాన్ని పై దండెత్త సాగాడు. నముచి.... బ్రహ్మా ఇచ్చిన వరాలని రక్షక కవచంగా భావించి, దొదాద్రి కొండపై, ఒక గుహలో తన దేహాన్ని వదిలి ఆత్మ రూపంలో ఉన్నాడు .


ఇంద్రుడు సుదర్శన చక్రాన్ని సముద్రపు నీటిలో--నురగలో ముంచి తీసాడు.అది తడి కాకుండా, ఎండినట్లు కాకుండా ఉన్న చక్రాన్ని దోదాద్రి వైపు విసిరాడు. సుదర్శన చక్ర రూపంలో ఉన్న నారాయణుడు.... ఉగ్రనరసింహ రూపునిగా ఆ దుష్టుని సంహరించాడు. నముచి సంహారము తరవాత కూడా నరసింహ స్వామి ఉగ్రరూపం శాంతించలేదు. అందుచేత ఇంద్రాది దేవతలు, నరసింహస్వామిని.... అమృతాన్ని సేవించమని కోరారు. అమృతం సేవించిన తరవాత, నారసింహని రౌద్రం శాంతించింది. ----కనుక త్రేతాయుగంలో---నెయ్యి, ద్వాపరయుగంలో---పాలు, కలియుగంలో----పానకం తాగి తాను శాంతిస్తానని స్వామి చెప్పారు.

హ్రస్వసృంగి సదా నారాయణుని ధ్యానించి, ఇక్కడే అవతరించమని వేడుకొనగా, నారాయణుడు ఈ పర్వతం మీదనే వెలసినాడు. లక్ష్మీదేవి కూడా ఇక్కడే అవతరించటం వల్ల ఈ (ప్రాంతాన్ని) క్షేత్రాన్ని "మంగళగిరి" అని అంటారు.

గర్భగుడిలో స్వయంభూమూర్తి 15 cm వరకు, నోరు తెరిచినట్లుగా ఉన్న నరసింహ స్వామి దర్శనం మహదానందాన్ని కలిగిస్తుంది. శంఖంతో స్వామికి పానకాన్ని సమర్పించినప్పుడు, మనం నీరు తాగేటప్పుడు వచ్చే శబ్దం వలె మనకు వినిపిస్తుంది. పానకం లోపలి వెళ్ళేటప్పుడు శబ్దం ఎక్కువై , తదుపరి నిశ్శబ్దమైపోతుంది. తరవాత స్వామివారి నోట పానకం చూడగలం. ఆ పానకమే తీర్థముగా అందరికీ పంచిపెడతారు. పానకము ఆలయములో ఉన్నాగానీ..... చీమ , ఈగ... ఏవీ కూడా మనకు కనిపించవు.

రాత్రిపూట స్వామిని పూజించుటకు దేవతలు వస్తారని.... పురాణాలు పేర్కొంటున్నాయి. అందుచే భక్తులకు పగటిపూట మాత్రమే ఆలయంలోకి వెళ్ళే అనుమతి లభిస్తుంది.

ఈ స్వామిని దర్శిస్తే అనారోగ్యాలు తగ్గి, ఆరోగ్యవంతులు అవుతారు. కోరిన కోర్కెలు సిద్ధిస్తాయి. మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి కృప అందరికి కలుగును గాక.

Friday, 24 January 2014

Yaganti Temple Information

శ్రీ ఉమా మహేశ్వర దేవాలయం - యాగంటి | Sri Yaganti Uma Maheswara Temple - Kurnool-  Andhrapradesh
Sri Yaganti Uma Maheswara Temple Information

కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌనద్ర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి. 


 యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం వున్నది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్టించారని ఒక కథ ప్రచారంలో వున్నది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.







అగస్త్య పుష్కరిణి

ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషద గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం వున్నది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వున్నది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, వున్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా వున్నాయి.





సహజసిద్ధమైన గుహలు 

యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్టించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనె ఇంకో గుహ లో బ్రంహం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ , రోకళ్ళగుహ అనికూడా అంటారు. 




కాకులకు శాపం

ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.








యాగంటి బసవన్న 

ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ప్రస్థావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.




Location : 

Yaganti is located in the Kurnool District in the state of Andhra Pradesh, India, approximately 100 km from the city of Kurnool. The temple is in the Banaganapalle mandal, 14 km west of Banagapalle (Mandal headquarters) on the Banaganapalle-Peapully road.

యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగాన పల్లి లో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో వున్నది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం వున్నది. 

తెలుగు వికీపీడియా నుంచి తీస్కునబడింది : యాగంటి

Saturday, 18 January 2014

Sri Kalahasti Templeinformation

శ్రీ కాళహస్తి   - | Srikalahasti ( Vayulingam) - Andrapradesh
శ్రీ కాళహస్తి

కాకినాడ నుంచి తిరుమల వెళ్ళే భక్తులకు నా సలహా ఏమిటంటే .. తిరుమల వెళ్ళే శేషాద్రి exp . శ్రీ కాళహస్తి లో 4.30 -5. 00 ఆ టైం లో ఆగుతుంది మీరు అక్కడే దిగండి . రైల్వే స్టేషన్ లో స్నానం చేయడానికి ఏర్పాట్లు బాగానే ఉన్నాయ్ .. అక్కడ నుంచి టెంపుల్ కూడా దగ్గరే బయట ఆలయం వాళ్ళు ఏర్పాటుచేసిన ఉచిత బస్సు  మరియు షేర్ ఆటో లో కూడా ఉన్నాయి  .. శ్రీ కాళహస్తి లో ఉన్న  శివలింగం పంచభూతలింగాల్లో  ఒకటైన వాయు లింగం . మీరు దర్శనం చేస్కునేప్పుడు గమనిస్తే లింగానికి ఎదురుగ ఉన్న దీపం స్వామి వారి నుంచి వస్తున్నా గాలికి దీపం ఊగుతూ కనిపిస్తుంది . అక్కడ ఉన్న పూజారులు మీకు చెబుతారు .. మరో విషయం ఏమిటంటే మనం అక్కడ ఇతర కోరికలు ఏమి కోరకూడదు అని పెద్దలు చెబుతారు .. ఈ ఆలయం లో స్వామి వారి కంటే ముందే అమ్మవార్కి  ఉదయాన్నే పూజలు ప్రారంభిస్తారు .. భక్తుడైన కనప్ప కొండపైన దేవుడు కొండ క్రింద ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తి . ముందుగా భక్త కన్నప్పను దర్శించుకుని తరువాత స్వామి వారని దర్శనం చేస్కోవాలి అని స్థలపురాణం .. స్వామి వారి ఆలయం నుంచి బయటకి వచ్చేటప్పుడు కుడివైపుకి వైపు కి మీరు వెళ్తే అక్కడ చోట నుంచి చూస్తే  .. భక్తకన్నప్ప గుడి , అమ్మవారి గుడి , ఆలయ ద్వజస్థంబం కనిపిస్తాయి . అక్కడ ఉన్నవాళ్ళని అడగండి వాళ్ళు చూపిస్తారు . ఇక్కడ నుంచి తిరుపతికి రెగ్యులర్ గ బస్సు లు ఉంటాయి . ఆలయం బయట నిలబడితే అక్కడికే వచ్చి ఆగుతాయి సుమారు 1గం ॥ సమయం పడుతుంది . 
 










 
చారిత్మాక ప్రాశస్త్యం
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి నెలకోల్పినారు.పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు

శ్రీకాళహస్తిశ్వరస్వామి మహత్యం

శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యం పొంది శివునిలో గలసిపోయినవి.అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చెను

సాలె పురుగు- శివ సాయుజ్యం
కృతయుగంలో చెలది పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుని పూజించుచుండెను.ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న దేపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగులబడిపొవుచున్నట్లు చేసిను. ఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను.అపుడు సాలీడును మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనెను.అందుకు శివుడు సమ్మతించి సాలిడుని తనలో ఐఖ్యమైనపోవునట్లు చేసిను.ఈ విధముగా సాలీడు శివసాయుజ్జ్యము పొంది తరించింది

నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది.ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి,ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమునకు పూజచేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమును సేవింపజొచ్చెను.అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు,పుష్పములు,బిల్వదళములు తెచ్చి,పాము సమర్పించిన మణులను త్రోసివేసి,తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను.మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వానికి బదులు బిల్వములు,పుష్పములు పెట్టియుండుట గాంచెను.అప్పడు పాము మనస్సున చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పువ్వులను త్రోసివేసి,తాను ఇట్లు కొంత కాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు ,ఏనుగు ఉంచిన పుష్పదులను పాము శుబ్రపరచి తమ తమ ఇష్టనుసరముగా పూజచేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి..ఒక రోజు పాము విసుగెత్తి తన మణుల త్రోయబడి ఉండుటకు కోపం చెంది.ఈ విషయమునకు కారణము తెలుసుకొన గోరి ప్రక్కనే యున్నా పొదలో దాగి పొంచి యుండెను.అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు తొండములో దూరి కుంభస్టలమున నిలిచి డానికి ఉపిరి ఆడకుండా చేసిను.ఈ భాధకు ఏనుగు తాళ్ళజాలక ఈశ్వర ధ్యానంతోతొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాతికిమోది తుదకు మరణించెను.ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్టలమున నుండిన పాము గూడా చచ్చి బయటబడినది.ఇట్లు ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మరి స్వామి ఐఖ్యమొందిరి.

ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ ఫణాకారముగా శిరోపరిభాగమునకు ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ,తన లింగాకృతిలో నైక్యమొనరించుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇచ్చట దర్సనం ఇచ్చుచున్నాడు.ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంకు `శ్రీ -కళా-హస్తి అని పేరు వచ్చింది
 శ్రీ కాళహస్తి లోని గాలి గోపురం. శ్రీకాళహస్తికే మారుపేరుగా వుండిన ఈ రాయల గోపురము కూలి పోయింది.

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమున కెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు. శ్రీ కాళ హస్తి తిరుపతికి సుమరు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది. అన్ని విదాల రవాణ సౌకర్యాలున్నవి.

ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్టుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కధలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి వారికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకము లయిన చిత్రములు వున్నాయి. " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము కలదు. దేవాలయమునకు సమీపములో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాస మనియు, సత్య మహా భాస్కరక్షేత్ర మనియు , సద్యోముక్తి క్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్థంభాలు కలిగిన మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం మే 26, 2010 న కూలిపోయింది.

క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపు కొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపునిచ్చారు. ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు బయట వున్న కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి.
శ్రీ కాళహస్తి ఆలయ ప్రాంగణము

* నాలుగు దిక్కుల దేవుళ్ళు

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖుని గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.
శ్రీకాళహస్తి ఆలయ రథము. దీనిపై స్వామివారిని ఉత్సవ సమయంలో ఊరేగిస్తారు

* గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, మరియు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

* రాహు కేతు క్షేత్రము
ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

* దక్షిణామూర్తి
దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందు కొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము

* తీర్ధాలు
ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

* ఇతర విశేషాలు
ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి.

Wednesday, 8 January 2014

Trichy to Kanyakumari

తిరుచిరాపల్లి (trichy) నుంచి రాక్ పోర్ట్ టెంపుల్ ( శివ,గణేష ) 5కిమీ .. తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగం 8 కిమీ .. శ్రీరంగం నుంచి జంబుకేశ్వరం ( జల లింగం ) 2 కిమీ . తిరుచిరాపల్లి నుంచి తంజావూర్ ( శ్రీ బృహదీశ్వరాలయం) 60 కిమీ . తంజావూర్ నుంచి తిరువైయార్  ( త్యాగరాజ స్వామి ఉరు ) 14కిమీ .. తిరువైయార్ నుంచి స్వామిమలై ( సుబ్రమణ్యస్వామి ) 25కిమి ..
స్వామిమలై నుంచి కుంబకోణం ( సోమేశ్వర టెంపుల్ ) 5కిమీ . 





తిరువైయార్





మధురై నుంచి రామేశ్వరం 170 కిమీ . మధురై నుంచి పళని 120కిమీ . మధురై నుంచి కన్యాకుమారి 240 కిమీ . మధురై నుంచి కోడైకేనల్ 115కిమీ . మధురై నుంచి ఊటి 280కిమీ . మధురై నుంచి శ్రీరంగం 140 కిమీ .


తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రం.. మధురై నుంచి 280 కిమీ.
చూడవలసిన ప్రదేశాలు :
బొటానికల్ గార్డెన్స్ , దొడ్డబెట్ట శిఖరం , ఊటీ బోట్‌హౌస్ ,కాఫీ తోటలు..




Kodaikanal

Tuesday, 31 December 2013

Sringeri Temple Information

శృంగేరి   | Sringeri ( Sharada Peetham ) Temple Information

శ్రీ మోహన్ గార్కి కృతజ్ఞతలు తెలియచేస్తూ .. ఆయన రాసిన పోస్ట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ..


కొల్లూరు మూకాంబికా అమ్మవారి ఆలయం దర్శించిన తర్వాత, అదే రోజు బయలుదేరి మేము శృంగేరి చేరుకున్నాము.


మేము కొల్లూరు నుండి శృంగేరి వేళ్ళడానికి బయలుదేరేసరికి కొల్లూరులోనే సాయంత్రం 5.30 దాటిపోయింది. ఇక అప్పుడు బయలుదేరి, ఘాట్ రోడ్ మీదుగా శృంగేరీ ప్రయాణం పరమాద్భుతం. ఆ వెళ్ళే దారిలోనే, దేశంలో రెండవ అతి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే "అగుంబే" మీదుగా వెళ్ళాము, ఆ అగుంబేలోనే, సూర్యాస్తమయం తప్పనిసరిగా చూడవలసినది అని చెప్పారు. కానీ సాయంత్రం ఆలస్యంగా బయలుదేరడం వలన, అగుంబే చేరేసరికే రాత్రి ఏడున్నర అయ్యింది, అంత రాత్రి వేళలో, ఆ 'sunset pint' దగ్గర ఆగినా, చీకటిపడిపోవడం వలన ఏమీ పెద్ద కనబడలేదు. ఇక మేము శృంగేరీ చేరే పర్యంతమూ, చక్కగా 'జయ జయ శంకర - హర హర శంకర' అని నామం చేసుకుంటూ రాత్రి తొమ్మిది అయ్యేసరికి శృంగేరి చేరుకున్నాము, వెడుతూనే అక్కడ శృంగేరీ పీఠం యొక్క ముఖ ద్వారం ఎదురుగా ఉన్న భారతీతీర్థ కృప అనే వసతి గృహంలో మాకు రూమ్ దొరికింది. మేము ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయమే వసతి గృహములో సంధ్యావందనం చేసుకుని, శారదాంబ ఆలయానికి బయలుదేరాము.
Inline image 5

ఆలయం లోపలికి అడుగుపెడుతూనే అక్కడి ప్రశాంత వాతావరణము చాలా చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఈ భూమి మీదే కదా ఆదిశంకరుల నుండి ప్రారంభించి, ఎంతో మంది జగద్గురువులు పాదధూళి కలిగిన ప్రదేశం, ఈ క్షేత్రం గురించే కదా మన పూజ్య గురువు గారు ఎన్నో మార్లు ప్రవచనములలో చెబుతూ ఉంటే .........ఎప్పుడెప్పుడు మనము కూడా వెళ్ళి ఆ శృంగేరీ క్షేత్రం దర్శిస్తామా........ అని కలవరించేవాళ్ళము అని తలచుకుంటూ లోపలికి వెళ్ళాము.

ప్రస్తుతం ఆలయం వెలుపల ఒక రాజగోపుర నిర్మాణం జరుగుతోంది. అందుచేత, ఆలయంలోకి ప్రవేశం ఆ రాజగోపురంలోంచి కాకుండా, ఆ గోపురానికి కుడివైపున మరో ద్వారం ఉన్నది. అందులోంచి లోపలికి ప్రవేసిస్తాము. లోపలికి వెళ్లగానే మొదట ఎడమవైపుకి తిరిగగానే, అక్కడ శృంగేరీ పీఠ కార్యనిర్వహణాధికారి వారి ఆఫీసు ఉంటుంది, దాని ఎదురుగా ఒక పెద్ద బోర్డ్ మీద, శృంగేరీలో ఎక్కడెక్కడ ఏ ఏ మందిరాలు ఉన్నాయో రూట్ మ్యాప్ చూపిస్తూ ఉంటుంది. ఆ బోర్డ్ దాటి కాస్త నడిచి కుడివైపు తిరిగితే ఇక అక్కడ ఉన్న ఆలయాలు దర్శనం అవుతాయి. మొదట ఆ లోపలికి వెళ్ళగానే ఎడమ వైపు చంద్రశేఖర భారతీ సభామంటపము ఉంటుంది. (ఈ మంటపములోనే, జగద్గురువులు విజయ యాత్ర ముగించి శృంగేరీ చేరిన వెంటనే అనుగ్రహ భాషణం చేశారు..), ఆ మంటపము ప్రక్కగా యాగశాల ఉంటుంది. కుడిచేతి వైపు చూడగానే, మొదట అక్కడ సేవా కౌంటర్లు, ప్రసాదం ఇచ్చే కౌంటర్లు కనబడతాయి. ఆ రెండు కౌంటర్ల మధ్య నుంచి ఒక హాలులోకి వెళ్ళే ప్రవేశ ద్వారం కనబడుతుంది. ఆ హాలు పేరు నాకు గుర్తు లేదు కానీ, ఆ హాలులోకి వెడితే, ఆ లోపల గోడల మీద ఆదిశంకరుల జీవిత చరిత్రని చెప్పే అద్భుతమైన చిత్తరువులు కనబడతాయి. ఇంకా ఇదే హాలు లోంచి లోపలికి వెళ్ళి, ఆ హాలుకి వెనుకవైపు ఉన్న ద్వారంలోంచి బయటికి వెడితే అక్కడ, ఆదిశంకరుల ఆలయము కనబడుతుంది. ఈ ఆదిశంకరుల మూర్తిని ప్రతిష్టించినవారు 33వ పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు. ఈ ఆలయంలో ఆదిశంకరులు యోగాసనంలో కూర్చుని, కుడిచేతిలో చిన్ముద్ర, ఎడమ చేతిలో అభయ ముద్ర చూపిస్తూ ఉంటారు. శంకరుల పాదపీఠం మీద నలుగురు శిష్యుల మూర్తులు దర్శనమిస్తాయి. శంకరుల ఎదురుగా ఒక చిన్న శివ లింగము కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ శంకరుల ఆలయంలో చిన్న ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. మెట్లెక్కే దారిలో ఏనుగులు, ఆలయం ఎదురుగా పరమశివుని మూర్తి రూపం చెక్కబడుతున్నాయి. ఈ ఆలయం పూర్వంలో ఉన్న ఫోటో శృంగేరీ పీఠం వారి సైట్లోంచి క్రింద చూడగలరు.
Inline image 6

ఆ ఆలయంలోనే వాయువ్య దిక్కులో తోరణ గణపతి కూడా దర్శనమిస్తారు. ఈ తోరణ గణపతి గురించిన వృత్తాంతము శృంగేరి పీఠం వారి సైట్ నుంచి సంగ్రహించినది.. తెలుగులో తర్జుమా చేసి ఇక్కడ ఇస్తున్నాను..
తోరణగణపతిః
Inline image 7

శృంగేరీలో 33వ పీఠాధిపతి అయిన శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారి సమయం నుంచి జగద్గురువుల నివాస స్థలములు, తుంగానదికి దక్షిణ దిక్కున ఉన్న నరసింహవనంలోకి మార్చబడ్డాయి. అంతకు పూర్వం ఆచార్యులంతా, శారదా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న శంకరుల సన్నిధికి దగ్గరగా ఉండేవారు. 32వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వృద్ధనృసింహ భారతీ స్వామి వారు జగద్గురువులుగా ఉన్నప్పుడు,
ఒకానొక సమయంలో మఠమునకు సంబంధించిన ఒక సమస్యని పరిష్కరించే ఆలోచనలో ఉన్నప్పుడు, వారికి గణపతి ధ్యానంలో సాక్షాత్కరిమ్చారు. ఆయన వెంటనే, దగ్గరలో ఉన్న ద్వారంలోని తోరణంలో ఉన్న గణపతికి దూర్వాంకురం వేసి పూజ చేశారు. అప్పటితో ఆ సమస్య తీరిపోయింది. అప్పటినుంచి ఆ తోరణము నందున్న గణపతిని తోరణపతి అని పిలిచేవారు.
Inline image 8

తర్వాత కాలంలో వృద్ధ నృసింహ భారతీ స్వామి వారి శిష్యులయిన శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు ప్రతీ రోజూ దూర్వాంకురముతో పూజ చేసేవారు. ఆ తర్వాత చంద్రశేఖర భారతీ స్వామి వారు వెండి కవచం చేయించారు, ఆ తర్వాత అభివన విద్యాతీర్థుల వారు తోరణగణపతి సన్నిధిలో నిత్య పూజ జరిగేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి వారు స్వర్ణకవచం చేయించారు. మేము వెళ్ళినప్పుడు స్వామి వారికి నిత్య పూజ జరిగి హారతి ఇస్తున్నారు.

Inline image 9

మళ్ళీ వెనక్కి వస్తే, ఇందాక ఏ ప్రసాదం కౌంటర్ పక్కనే ఉన్న ద్వారంలోంచి హాలులోకి వెళ్ళామో, ఆ ద్వారం గుండా మళ్ళీ బయటకి వస్తే, కుడి చేతివైపు, శారదా అమ్మవారి ఆలయం కనబడుతుంది. ఈ ఆలయంలోనే, ఆదిశంకరులు ప్రతిష్టించిన పరాదేవత స్వరూపం, శారదా అమ్మవారి మూర్తి కనబడుతుంది. ఇప్పుడు ఉన్న శారదా అమ్మవారి మూర్తి స్వర్ణ మూర్తి, ఈ మూర్తిని పూర్వ ఆచార్యులైన, శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారు ప్రతిష్టించారు అని చెప్పారు. అంతకు పూర్వం ఉన్న చందన శారదా అమ్మవారి మూర్తిని, విద్యాశంకర ఆలయంలో గర్భగుడికి బయట ఎడమచేతి వైపు చూడవచ్చు.
Inline image 1Inline image 2


శారదా ఆలయంలో ప్రవేశించగానే, దూరం నుంచే అమ్మవారు దర్శనమిస్తూ కనబడతారు. ఒక్కసారి ఒళ్ళు పులకిస్తుంది. శ్రీశారదా నమోస్తుతే. శ్రీశారదా నమోస్తుతే! అని విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్త పుటీ, కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచి విభాసి వైరించి అని మూకపంచశతిలో శ్లోకం చదువుకుని, అమ్మకి నమస్కరించి, లోపలి ప్రాంగణంలో ప్రదక్షిణం చేయడం మొదలు పెట్టాము. ప్రదక్షిణ చేసేటప్పుడు, మొదట ఎడమవైపు, జగద్గురువులు కూర్చునే పెద్ద సింహాసనం, ఆ పక్కనే జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి మూర్తి ఉంటుంది, ఇంకా కొంచెం ఎదరకి వెళ్తే, ఎడమవైపే, అక్షరాభ్యాస మంటపము అని కన్నడంలో వ్రాసి ఉంటుంది. ఈశ్వరుడు అనుగ్రహిస్తే, మా బుజ్జితల్లి చి.లలితా షణ్ముఖప్రియ శ్రీవల్లి కి మూడవఏడు రాగానే ఇక్కడ అమ్మ సమక్షంలో అక్షరాభ్యాసం జరిగితే బాగుండు అని కోరిక అనాలో/ లేక సంకల్పం అనాలో తెలియదు... కానీ బలంగా అమ్మ తప్పకుండా ఆ కోరిక తీరుస్తుంది అనిపించింది. అలాగే ఇంకా ఎదరకి ప్రదక్షిణం చేస్తూ వెడితే, ఎడమచేతివైపు చివరకి వెడితే, నైరుతి దిక్కులో శక్తి గణపతి దర్శనమిస్తారు.
Inline image 3

 ఇంకా ప్రదక్షిణంగా వెడితే, అమ్మవారి ఆలయానికి వెనుక భాగంలో చాలా పెద్ద మేరువు, నా పొడవు కన్నా ఎత్తైనదేమో అని చెప్పాలి, అంత పెద్ద మేరువు ఉంటుంది. నా జీవితంలో అంత పెద్ద మేరువు ఎక్కడా చూడలేదు. ఇంకా ముందుకి వెళ్తే, అక్కడ చాలా పెద్ద ఉత్సవ మూర్తులు, అమ్మవారు, అయ్యవారు, గణపతి మొదలైన మూర్తి దర్శనం అవుతుంది. అలా ప్రదక్షిణం చేసి, శారదా అమ్మవారిని కాస్త దగ్గరగా దర్శించుకుని, బయటకి వచ్చాము. శారదా అమ్మవారికి విశేషమైన అలంకారం ఉండడం వల్ల, ఎక్కువగా అమ్మ పాదాలు కానీ, ఎలా కూర్చున్నదీ మొదలైన వివరాలు మాకు అర్ధం కాలేదు. అమ్మ మాత్రం స్వర్ణమయమై, ఆ గర్భ గోడల దగ్గర నుంచి స్వర్ణమయమై ఉందేమే, మా అమ్మ శారద మెరిసిపోతూ, చిరునవ్వులొలికిస్తూ,.."ఏమిరా మోహనా!!! నా జ్ఞానపుత్రుని వాక్కులు క్రమం తప్పకుండా వింటున్నావా?? వారు చెప్పిన వాక్కులను ఆచరణ యందు పెడుతున్నావా?? నువ్వు నా జ్ఞానపుత్రుడి పాదాలు పెట్టుకోరా నాన్నా, చాలు ....... నీ జీవితం ధర్మబద్ధమై, నీకు గురుకటాక్షం లభిస్తుంది." అన్ని అమ్మ పలకరించి ఆశీర్వదించింది. నువ్వు నా జ్ఞానపుత్రుని వాక్కులను వింటూ, వారికి ప్రతీ రోజూ నమస్కరిస్తూ, వారు చెప్పిన వాక్కులను ఆచరణ యందు అనుష్టిస్తూ ఉన్నావా... నీకు నా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందిరా నాన్నా అని అభయం ఇచ్చినది.
Inline image 10
అలా అమ్మవారి దర్శనం చేసుకుని బయటకి వచ్చాక, శారదా అమ్మవారి ఆలయంలోంచి బయటకు వస్తూ ఉంటే ఎడమవైపు (శారదా ఆలయంలోపలకి వెళ్ళేటప్పుడు, మనకి కుడివైపు) చిన్న కోదండరామాలయం ఉంటుంది, స్వామి లక్ష్మణ, సీతా సమేతుడై కోదండం పట్టుకుని దర్శనమిస్తారు.

Inline image 11

అదే విధంగా శారదా అమ్మవారి ఆలయంలోంచి బయటకి వస్తూ ఉంటే కుడివైపు (శారదా ఆలయంలోపలకి వెళ్ళేటప్పుడు, మనకి ఎడమ వైపు)గా మలయాళ బ్రహ్మ ఆలయం దర్శనమిస్తుంది. కర్ణాటకలో క్షేత్రపాలకుడిని మళయాళబ్రహ్మ అని వ్యవహరిస్తారు. ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ మళయాళ బ్రహ్మ పూర్వం ఒక బ్రాహ్మణుడు, ఆయన అన్ని వేదాలు, శాస్త్రాలు చదువుకుని కూడా ఎవరికీ చెప్పేవారు కాదుట. అందుకని ఆయన శాపవశాత్తు, బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు. ఒకనాడు విద్యారణ్యుల స్వామి వారి విజయయాత్రలో వెళిపోతూ ఉండగా ఈ బ్రహ్మరాక్షసుడు స్వామి వారి పాదములమీద పడి, తనకి విముక్తి కలిగించమని ప్రార్ధిస్తాడు. అప్పుడు విద్యారణ్యుల వారు అతనిని అనుగ్రహించి, శృంగేరీలో క్షేత్రపాలకుడిగా ఉందమని అభయమిస్తారు. ఈ స్వామి వారికి ఇప్పటికీ దద్దోజనం నివేదన చేసి, నరదృష్టి, దృష్టిదోషాలు పోవాలని ఇక్కడ పూజలు చేస్తారు.


Contact
Postal correspondence

The Administrator,
Sringeri Mutt and its Properties,
Sringeri, Chickmagalur District,
Karnataka
PIN - 577139.
Phone Numbers
 +91-8265-250123
 +91-8265-250594
 +91-8265-250192


http://www.sringeri.net/