Wednesday 24 October 2012

TIRUMALA - ALIPIRI


శ్రీనివాస గోవిందా | శ్రీ వెంకటేశా గోవిందా | భక్త వత్సల గోవిందా | భాగవతా ప్రియ గోవిందా | నిత్య నిర్మల గోవిందా | నీలమేఘ శ్యామ గోవిందా | గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

 అలిపిరి నుంచి తిరులమల నడక మార్గం  ( 20-10-12)



ఈ పోస్ట్  తిరుమల మొట్టమొదటి సారిగా అలిపిరి నుంచి మెట్లమర్గమున నడిచి వెళ్ళే వాళ్ళకోసం .
అలిపిరి చేరుకోవడం :
తిరుపతి రైల్వే స్టేషన్ / బస్  స్టాండ్  నుండి అలిపిరి కి బస్సు లు ఉన్నాయ్ . లోకల్ సిటీ బస్సు లు కూడా నడుపుతున్నారు ( టికెట్ 8/- )


మీతో పాటు తీస్కుని వచ్చిన లాగేజ్  ని అలిపిరి వద్ద ఉన్న  లగ్గేజ్ రూమ్ వద్ద  మీరు ఇచ్చినట్లైతే  మీరు కొండపైకి చేరుకున్న తరువాత మీ లగేజ్ ని కొండపైన ఉన్న లగ్గేజ్ రూమ్ వద్ద మీరు తిస్కోవచ్చును .
మీరు మీ బాగ్ లకు తాళాలు వేయకపోతే వాళ్ళు తిస్కోరు . తాళాలు బయటే అమ్ముతారు ( 15/- ) .
చాల తక్కువ బరువున్న సామాన్లు మాత్రమే మీతో తీస్కుని వెళ్ళండి . 

తిరుమల నడకదారి ప్రారంభం .. అందరు ఒక్కసారి గోవిందా .. గోవిందా అని ప్రారంభించండి 
 


శ్రీ వారి పాదాల మండపం
నారాయణాద్రి  , తిరుమల
మీరు కొండపైకి ఎక్కుతున్నప్పుడు  స్వామి యొక్క అవతారాలు   మీరు చూడవచ్చు 

 మత్స్యావతారము 

  • నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు.
  • సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపము వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి.
  • మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంతవరకు గ్లూకోసు, నీళ్లు - వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు(కోక్,పెప్సీ మొ.) ఏ విధంగానూ మన నడకకు సహకరించవు.
  • నామాల కొండ వద్ద తొందరగా దైవదర్శనం అయ్యేందుకు ఇస్తున్న రశీదు తీసుకోవడం మరచిపోవద్దు. ఆ తరువాత కొంత దూరం నడిచినాక మళ్ళీ ఆ రశీదు మీద ముద్ర వేయించుకోవడం మరచిపోవద్దు.
  • లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజిని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత రవాణా సేవలో పైకి పంపించండి.


గాలి గోపురం వద్ద బయోమెట్రిక్ ద్వారా వెలి ముద్రలు ఇచ్చి టోకెన్ తీస్కోండి
ఆ టోకెన్ ద్వారా మాధవ నిలయం వసతి సముదయలల్లో  ఉచిత వసతి , భోజనం అందుకోండి .
తలనీలాల సమర్పణ కూడా ఉచితం . 


తలయేరుగుండు

 కొండ ఎక్కేవారు తలయేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను, మోకాళ్లను తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో వాటిని చాల స్పష్టంగా చూడవచ్చు. 


తిరుమల మెట్ల మార్గం 


కూర్మావతారం 





వరాహావతారం



శ్రీ నరసింహావతారం


కొండపైనుంచి తిరుపతి 

 శ్రీ వామనావతారం

గాలిగోపురం


దివ్య దర్శన్ టోకెన్ కౌంటర్ కు దారి
 ఇక్కడే టోకెన్ తీస్కోవాలి



ఈవిధంగా ఉంటుంది  . జాగ్రత్తగా ఉంచండి. దారి మధ్యలో  ఒక చోట స్టాంప్ వేస్తారు 


కొండ క్రిందనుంచి .. కొండపైకి వెళ్ళే దారిలో చాల చోట్ల ఉచిత మరుగుదొడ్లు కలవు .




 ఇప్పడివరకూ నడివచ్చరుగా కొద్దిసేపు విశ్రాంతి తీస్కోండి  :) 


 ఇక్కడ నుంచి మెట్లు తక్కువగ  ఉంటాయి .. చూస్తున్నారుగా ఎలాఉందో దారి .




శ్రీ పరశురామావతారం



అంజనాద్రి 

 ఈ విధంగానే ఉంటుంది మార్గం ..
 నేను చెప్పింది మొత్తం మెట్లు ఉండవ్ అని కాదు .... :)
 గోవిందా ... 2300 మెట్ల వరకు వచ్చాం 
శ్రీ రామావతారం


 శ్రీ బలరామావతారం 
జింకలపార్క్ 










శ్రీ కృష్ణావతారం 



ఎవరు పెట్టారో ఇలా


 నడక మార్గం ( 6 కి.మీ.)
 బస్సు రూట్
మన యూత్  :)

శ్రీ కల్కి అవతారం 



జై హనుమాన్
 శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి




అమ్మ, నాన్న , అవ్వ 





గోవిందనామలు 



నేను చెప్పానుగా .. స్టాంప్ వేస్తారు అని .. అది ఇక్కడే .. లైన్ లైన్.. లైన్ లో వెళ్ళండి :)
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం 







ఎప్పుడన్నా వర్షం ( తూపాన్ ) పడే సమయం లో కొండ ఎక్కడానికి ప్రయత్నించండి ... 






 మంచి కెమెరా  ఐతే ఫోటోలు వేరేల వచ్చిఉండేవి 



మోకాల  పర్వతం దగ్గరలోనే  ఉంది నడవండి 





 అదిగో వచ్చేసాం .... మళ్ళి  అందరు ఒకసారి గట్టిగ గోవిందా.. గోవిందా .. అనండి 






 ఇక్కడ చాల మంది మోకాళ్లమీద నడవడానికి ప్రయత్నిస్తారు .. అల ఎందుకు నడుస్తారు నాకైతే తెలియదు
విజయమోహన్ గారు ఇలా చెప్పారు  
 "మోకాళ్ళతో ఎందుకు ఎక్కుతారంటే"
అక్కడంతా సాలగ్రామశిలామయమని భగవద్రామానుజులు మోకాళ్ళతో ఎక్కారంట అందుకని భక్తులు కొంతమంది అలా ఎక్కుతూ ఉంటారు.




గోవిందా .. గోవిందా






నారాయణాద్రి - శేషాద్రి


పోగయ్  అళ్ళారు




చెప్పానుగా నడవడం ఇంకా సులభంగా ఉంటుంది అని






గోవిందా .. గోవిందా
తిరుమంగై అళ్ళారు


ఇదే చివరి మెట్టు
 నెంబర్ ఎంత ?
పెరియ అళ్ళారు




మీరు క్రింద ఇచ్చిన లగేజి ని ఇక్కడ తిస్కోవచ్చు


సమాచార కేంద్రం






మాధవ నిలయం 



తిరుమల తిరుపతి దేవస్థానం :
1. కేవలం ఒక వ్యక్తికీ గది కేటాయించబడదు
2. గదుల కేటాయింపు 24 గంటల మాత్రమే
3. గది లోపల పర్నిచర్ ఉండదు
4. నీరు గదుల వెలుపల ఉన్న కామన్ టాప్  ద్వారా పట్టుకొనవలెను

స్వామి వారి దర్శనం కోసం వేసి ఉన్న భక్తులు .


స్వామి పుష్కరిణి లో స్నానం చేసి .. వరాహ స్వామిని దర్శించుకుని .. గోవిందుడిని దర్శించండి .


శ్రీవారి మెట్టు:

తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి .. 1. అలిపిరి 2. శ్రీవారి మెట్టు.
అలిపిరి కాలిబాటకు శ్రీవారి మెట్టు కు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే శ్రీవారి మెట్టు కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.
శ్రీవారి మెట్టు దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు కాలం అగస్త్యాశ్రమం లో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. నడిరేయి ఏ జామునో అలమేలు మంగను చేరడానికి దిగి వచ్చే స్వామి ఒక అడుగు ఈ "శ్రీవారి మెట్టు"పై వేసి రెండవ డుగు అలమేలు మంగాపురంలో వేస్తాడని ప్రతీతి. చంద్రగిరిని వేసవి విడిదిగా చేసుకొన్న విజయనగర చక్రవర్తులు శ్రీవారి మెట్టునుండ ఉన్న మెట్లదారిలో తిరుమలేశుని దర్శనం చేసుకొనేవారు. తన దేవేరులతో కలిసి కృష్ణ దేవరాయలు ఈ మార్గంలో అనేక పర్యాయాలు నడచి స్వామిని దర్శించుకొన్నాడు.
శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది.
కపిల తీర్థం:



తిరుమల కొండల్లోని ఔషధ వృక్షాల నడుమ ప్రవహిస్తూ వచ్చి కపిల తీర్థం దగ్గర కొండ మీద నుంచి పుష్కరిణిలోకి జాలువారుతుంది నీరు. ఈ నీటిలో స్నానాలు చేస్తే సర్వరోగాలు నశిస్తాయని నమ్మకం .
స్థలపురాణం:

వెంకటాచలం క్షేత్రంలో సుమారు 15 పుణ్యక్షేత్రాలున్నాయి. ఇందులో ప్రధానమైనది కపిల తీర్థం. ఇక్కడ శివలింగం పాతాళం నుంచి పెరుగుతూ భూమిని చీల్చుకుని పైకి వచ్చింది. దీనిని గుర్తించిన మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేశారు. మహావిష్ణువు దానిని పెరగకుండా నిరోధించాడు. కపిల మహర్షి ఈ శివలింగాన్ని తొలిగా పూజించాడు. మహాలింగంతోపాటు పాతాళలోకంలోని భోగవతి గంగ కూడా భూమి మీదకు ఉబికింది. పుష్కరిణిగా మారింది. అదే కపిల తీర్థం.

ఎలా వెళ్ళాలి ?

తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది. బస్టాండ్ నుంచి మూడున్నర కిలోమీటర్లు. అన్ని రోజుల్లోనూ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు అనుమతిస్తారు. కార్తీకమాసం, ముఖ్యంగా పౌర్ణమి రోజు భక్తులు ఎక్కువగా వస్తారు.
దేవస్ఠానం  వారి ఉచిత బస్ శ్రీనివాసం, కపిల తీర్థం, అలిపిరి మరియు శ్రీనివాస మంగాపురం మీదగ శ్రీవారి మెట్టు వెళ్తుంది.    కపిల తీర్థం    మరియు శ్రీనివాస మంగాపురం వెళ్ళి దర్సనం చేసుకొందాం అనుకొంటే బస్ దిగి దర్సనం చేసుకొని తర్వాత వచ్చే బస్ లో    శ్రీవారి మెట్టు వెళ్ళవచ్చు. 

మీ సలహాలను కూడా పోస్ట్ చేయగలరు 
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి