Thursday 31 May 2012

Pardha Saradhi Temple - Triplicane

పార్థ సారథి దేవాలయం -ట్రిప్లికేను,చెన్నై | Pardha Saradhi Temple - Triplicane



పార్థ సారథి దేవాలయం చెన్నైలోని  ట్రిప్లికేనులో కలదు.  సంస్కృత భాషలో పార్థసారధి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.





బీచ్ కి దగ్గరలోనే కలదు .Triplicane రైల్ స్టేషన్ లో దిగితే చాల దగ్గర . లేదా బస్సు లో ఐతే క్రికెట్ స్టేడియం దాటినా తరువాత 2వ స్టాప్ .. అక్కడ దిగితే మీకు ఈ ఎంట్రన్సు కనిపిస్తుంది  .


 ఆళ్వారులచేత పాడబడిన 108 దివ్య స్థలములలో " తిరువళ్ళిక్కేణి" కూడా ఒక దివ్య స్థలము . ఈ పుణ్యక్షేత్రాన్ని " బౄహదారణ్య " క్షేత్రం అనే పేరుతో పిలుస్తుండే వారు .ఈ  దేవాలయము 1000 సంవత్సరములకు ముందే నిర్మిచబడింది . దేవాలయమందున్న శిలలేఖములవలన ఈ క్షేత్రమును నందివర్మ అనే పల్లవరాజు (779 - 830 ) మరియు విజయనగర రాజైన వేంకటపతి మహారాజు (1586 - 1616 ) మొదలైన మహారాజుల పాలనలో ఉండేదని తెలుస్తుంది . ఈ దివ్య మందిరము యొక్క మూలవిరాట్టు శ్రీ పార్ధ సారధి స్వామి యొక్క నిలువెత్తు విగ్రహము దర్శనం ఇచ్చును . స్వామి వారు ఎడమ భాగము నందు  "పాంచజన్య శంఖము " కనిపించును . దక్షిణ భాగమున శ్రీ చక్రము కాకుండా హస్తము పదము వైపు చూపించెను.  స్వామి వారు తూర్పు దిక్కున చూస్తున్నట్లు దర్శన మిచ్చును .స్వామి వారి భార్య రుక్మిణి ,అన్న బలరాముడు, తమ్ముడు సత్యకి కుమారుడు ప్రద్యుమ్నుడు , మనుమడు అనిరుద్ధుడు మొదలుగువారి సమేతంగా పార్ధ సారది దర్శన మిచ్చును . ఈయన మరో పేరు " వెంకట కృష్ణ



ఇక్కడో విషయం చెప్పాలి మీకు .. మీకు తిరుపతి తెలుసా ? ద్వారక తిరుమల కాదండి . మరొక తిరుపతి ఉంది. సామర్లకోట దగ్గర లోనే తిరుపతి (దివిలి నుంచి 2కి.మీ.)  ఉంది . అక్కడ కూడా స్వామి వారు . కుడి చేతిలో శంఖము , ఎడమ చేతిలో చక్రము పట్టుకుని మనకు దర్శనము ఇస్తారు . అక్కడ స్థల పురాణం ప్రకారం  ధౄవునికి  స్వామి వారు అక్కడే దర్శనం ఇచ్చారంట .  స్వామి వారు  ధౄవున్ని చూస్తూ నవ్విన నవ్వు మనకి చాల  స్వష్టంగా కనిపిస్తుంది.
మహాభారత యుద్ధము నందు ధ్రమసంస్తపనము చేయుటకై మహారధి భీష్ముని బాణాలు పార్ధసారధి యొక్క కపాలమున గుచ్చుకున్నవి కనిపించును . ఉత్సవమూర్తి నందు ఈ గుర్తులు కనిపించవు .


ఈ ఆలయం లో తెలుగు ఎక్కువగా కనిపించును ..

శ్రీ విష్ణు సవాస్రనామ స్తోత్రము 


పై ఫోటో లో తెలుగు పేర్లు చూసారా ? మీకు క్రింద కనిపిస్తున్నది స్థలపురాణం నేను పైన రాసింది అంత ఈ బోర్డు చూసే


కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల  మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది







* ఈ దేవాలయ ప్రాంగణములో ఉన్న అనుబంధ గుళ్ళు
* వేదవల్లి గుడి
* రంగనాథ స్వామి గుడి
* శ్రీరాముని గుడి
* వరదరాజస్వామి గుడి
* నరసింహ స్వామి దేవాలయం
* ఆండాళ్ళమ్మ గుడి
* అంజనేయ స్వామి దేవాలయం
* అళ్వార్ల సన్నిధి
* రామానుజాచార్యుల సన్నిధి
* భృగు మహర్షి గుడి







 ఆలయం వెలుపల కేనేరు కలదు .. చాల సువిశాలంగా ఉంది .




మీరు ఈ ఆలయం లో   వేదవల్లి గుడి,రంగనాథ స్వామి గుడి, శ్రీరాముని గుడి, వరదరాజస్వామి గుడి, నరసింహ స్వామి దేవాలయం,  ఆండాళ్ళమ్మ గుడి , అంజనేయ స్వామి దేవాలయం , అళ్వార్ల సన్నిధి, రామానుజాచార్యుల సన్నిధి, భృగు మహర్షి గుడి  కలవు .
* అమరనాథ్ యాత్ర విశేషాలు  
http://sujathathummapudi.blogspot.in/2012/05/blog-post_30.html
****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయడం మరిచిపోకండి****

Thursday 3 May 2012

Tiruvallur Temple Information

తిరువళ్ళూరు- శ్రీ వీర రాఘవుల స్వామి | Sri Veeraraghava Swami Temple- Tiruvallur

Tiruvallur Temple Information  :
తిరువళ్ళూరు, తమిళనాడు రాష్ట్రంలోగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరువళ్ళూరు జిల్లాకు ప్రధాన పట్టణం. త్రిమూర్తులలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో...వివిధ పేర్లతో కొలువుతీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలకు-‘దివ్యతిరుపతులు’,‘దివ్య దేశములు’ అని పేరు. మొత్తం 108 దివ్య తిరుపతులు వున్నాయి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ‘తిరువళ్ళూరు- Tiruvallur’లో శ్రీ మహావిష్ణువు ‘శ్రీ వీర రాఘవస్వామి’ పేరుతో శయనరూపం నయన మనోహరంగా కొలువుతీరి పూజలందుకుంటున్నాడు.


ముందుగా తిరువళ్ళురు ఎక్కడ ఉందో చెప్తాను, చెన్నై నుంచి  అరక్కోణం వెళ్ళేదారిలో ఉంది . చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్  పక్కనే ఉన్న లోకల్ స్టేషన్ నుంచి తిరువళ్ళురు  కి డైరెక్ట్ గా వెళ్లి ట్రైన్స్ ఉన్నాయ్ లేదా అరక్కోణం వెళ్ళే ట్రైన్ ఎక్కినా మీరు తిరువళ్ళురు చేరుకోవచ్చు . సుమారు 1 .30 hrs సమయం పడుతుంది .  తిరువళ్ళురు రైల్వే స్టేషన్ లో దిగిన తరువాత కుడివైపు కు వెళ్ళాలి . రైల్వే స్టేషన్ నుంచి గుడికి సుమారు 4 కి.మీ. దూరం ఉంటుంది . గుడి దగ్గరకు వెళ్ళడానికి  బస్సు లు ,ఆటో లు ఉంటాయి . మీరు బస్సు లో కంటే ఆటో వెళ్ళడమే మంచిది మనిషికి 10 /- తీస్కుంటారు .

పూర్వం తిరువళ్ళూరుకు ‘వీక్షారణ్య క్షేత్రం’ అనే పేరు వుండేది. స్వామివారు పూర్వం ‘ఎవ్వళ్’ (ఎక్కడ) పవళించాలని అడుగగా ఇవ్వళ్ (ఇక్కడే) పవళించమని శాలిహోత్రముని చెప్పిన ప్రాంతం కనుక ఈ క్షేత్రానికి ‘ఇవ్వళ్‌ఊర్’ అనే పేరు ఏర్పడినట్టు కథనం. ‘ఇవ్వళ్‌ఊర్’ అనే పేరు ప్రజల వాడుకలో కాలక్రమంలో మార్పుచెంది ‘తిరువళ్ళూర్’ అయినట్టు చెప్పబడుతూ వుంది.
ఈ ఆలయం లోని అధిష్టాన దైవమైన వీరరాఘవ స్వామి ఈ లోకంలోని సకలజీవరాసులకు అలాగే సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడు. అతడి దివ్యమైన పాదాలు సకల జీవులకు తక్షణ రక్షణ కిలిగించడమే కాక అసక్త నుండి అనారోగ్యం నుండి కూడా ఉపశమనం కలిగిచి అరోగ్యవంతమైన జీవితాన్ని కానుకగా ఇస్తాయి. ఇక్కడ ఉన్న వైద్యవీర రాఘవస్వామి కుటుంబ సమస్యలకు పరిష్కారం, వివాహజీవితంలో చిక్కులు విడదీయడం, ఆస్తులు భూముల సమస్యలను పోగొట్టడం వంటివి కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అంతేకాక చాలాకాలంగా సంతాన లేమితో బాధ పడుతున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని కలుగజేసాడ్ని విశ్వసిస్తున్నారు. ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని స్థల పురాణం చెప్తుంది. తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్ధం ఈ వుళ్ అంటే ఇవ్వడం అని అర్ధం. కనుక పవిత్రమైన దైవం సంతాన వరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువళ్ళూరు అయింది.





స్థలపురాణం అనుసరించి తై అమావాస్య అంటే సంక్రాంతి తరువాత వచ్చే అమ్మావాస్య రోజున మహర్షి తపసుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలి వాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపు పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన మూడు గజముల వస్త్రమును ధరించి ఆరోజు రాత్రి ఆయన గృహములో నివసించడానికి చోటు చూపమని అడిగాడు. ఆయన చూపిన గదిలో ఆ రాత్రికి విశ్రమించాడు. 

మరునాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలను చేసి ముసలి వాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేషశైనంలో పవళించి లక్ష్మీ దేవితో నాభికమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపించింది. తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని అయినా ఇక్కడకు వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీరరాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలని తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైన తొలగించి అరోగ్యాన్ని ఐశ్వైర్యాన్ని అందించాలని కోరుకున్నాడు. 


అమావాస్య రోజు మాత్రం ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది . శని -ఆదివారం కూడా ఆలయం ఆలయం భక్తులతో రద్దీ బాగానే ఉంటుంది  . దర్శనానికి 1 గంట  లోపే పడుతుంది . మిగత రోజులల్లో ఐతే మీరు అర్చనలు కూడా చేయించుకోవచ్చు .


ఈ ఆలయం లో లక్ష్మి దేవికి ప్రత్యేక సన్నిది కలదు . రాముల వార్కి , శ్రీ కృష్ణు నాకు కూడా ప్రత్యేక సన్నిది కలవు . ఆలయం లో శిల్పకళ ఆకట్టుకుంటుంది



 ఉప్పు మిరియాలు కలిపి ఇలా వేస్తున్నారు ..

శ్రీ వీరరాఘవస్వామి వారిని దర్శించి ఉప్పు, మిరియాలను సమర్పించడంవల్ల వివిధ వ్యాధులు ప్రధానంగా చర్మవ్యాధులు నయమవుతాయని చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెప్తారు.

ఇక్కడ ఉన్న కోనేరు చాల పెద్దది ..


మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి మరిచిపోకండి